- Advertisement -
కాశ్మీర్: శ్రీనగర్లోని పంథా చౌక్ చెక్పోస్టు వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసులు, సిఆర్పిఎఫ్ జవాన్లపై ముష్కరులు కాల్పులు జరిపి పారిపోయారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది పోలీసులతో కలిసి గాలింపు చర్యలు మొదలుపెట్టింది. ఈ తరుణంలో భద్రతాదళాలకు ఎదురుపడిన ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో అప్రమత్తమై భద్రతాదళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఏఎస్ఐ అమరుడయ్యాడు. జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. గత మూడ్రోజుల్లో 10 మంది ఉగ్రవాదులను భద్రతాదళాలు మట్టుబెట్టాయి.
Three terrorists killed in encounter At Srinagar
- Advertisement -