Friday, March 29, 2024

శ్రీనగర్ లో ఎన్ కౌంటర్: ముగ్గురు తీవ్రవాదులు హతం

- Advertisement -
- Advertisement -

Three terrorists neutralised in encounter at Batamaloo

 

శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లోని బటమలూ ప్రాంతంలో గురువారం ఉదయం ఎన్‌కౌంటర్ జరిగింది. సిఆర్‌పిఎస్ బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు తీవ్రవాదులు హతమయ్యారు. బటమలూ ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారని సమాచారం రావడంతో సిఆర్‌పిఎఫ్ బలగాలు, స్థానిక పోలీసులతో కలిసి తనిఖీలు చేపట్టారు. భద్రత బలగాలు కనిపించగానే ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో భద్రతా బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఒక తీవ్రవాది చనిపోయాడు. తప్పించుకున్న ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపడుతుండగా మరో ఇద్దరు కనిపించడంతో భద్రతా బలగాలు కాల్పులు జరపడంతో వాళ్లు హతమయ్యారు. ఘటనా స్థలం నుంచి మందుగుండు సామాగ్రి, ఎకె 47 తుపాకులను స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News