- Advertisement -
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం(టిటిడి)లో విషాదం చోటు చేసుకుంది. మహమ్మారి కరోనాతో ముగ్గురు ఉద్యోగులు మృతి చెందారు. ఇందులో ఇద్దరు టిటిడి ఉద్యోగులు కాగా, మరోకరు కాంట్రాక్ట్ ఉద్యోగి. ఇటీవల తిరుపతిలో జరిగిన ఎలక్షన్ తర్వాత కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ఇక, ఎపిలో కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. దీంతో రాష్ట్రంలో రోజూ కరోనా పాజిటీవ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. అలాగే కరోనాతో మరణించినవారి సంఖ్య కూడా పెరుగుతోంది.
Three TTD’s Employees dies due to Corona
- Advertisement -