Saturday, April 20, 2024

చెరువులో దూకి ముగ్గురు యువతుల ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -
three women fell into lake in jagtial
విషాదంలో జగిత్యాల

మనతెలంగాణ/జగిత్యాల: జగిత్యాల జిల్లా కేంద్రంలోని గాంధీనగర్‌కు చెందిన ముగ్గురు యువతులు జగిత్యాలలోని మంచినీరందించే ధర్మ సముద్రం చెరువులో దూకి బుధవారం సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడగా గురువారం ఆ మగ్గురి మృతదేహాలు చెరువులో తేలాయి. ఎక్కలదేవి గంగజల, ఎక్కలదేవి మల్లిక, ఎక్కలదేవి వందనల ఇళ్లు గాంధీనగర్‌లో పక్కపక్కనే ఉంటాయి. ఈ ముగ్గురు మంచి స్నేహితులు. గంగజల, మల్లిక ఇంటర్ పూర్తి చేయగా వందన ఇంటర్ చదువుతోంది. గంగజల, మల్లిక వివాహాలు ఆగస్టులో జరిగాయి. దసరా పండుగకు పుట్టింటికి వచ్చారు. బుధవారం ముగ్గురు స్నేహితులు కలిసి ఇళ్ల నుంచి బయటకు వెళ్లారు. రాత్రి వరకు ఆ ముగ్గురు ఇళ్లకు చేరకపోవడంతో ఆ మూడు కుటుంబాల సభ్యులు వెతికారు.

ముగ్గురు యువతులు మిస్ అయ్యారని కుటుంబ సభ్యులు పోలీస్‌స్టేషన్‌లో  ఫిర్యాదు చేశారు. పోలీసులకు సమాచారం అందించగా వారు చెరువు ప్రాంతానికి చేరుకుని బుధవారం మిస్ అయిన యువతుల్లో ఒకరిగా గుర్తించారు. కొద్దిసేపటికి మరో యువతి మృత దేహం లభ్యం కాగా ఆ ఇద్దరు గంగజల, మల్లి కలుగా గుర్తించారు. కాగా మరో యువతి వం దన శవం కోసం చెరువులో గాలించగా సాయం కాలానికి లభ్యమైంది. తమ కళ్ల ముందు కద లాడిన ముగ్గురు యువతులు విగత జీవులుగా కనిపించడంతో అటు కుటుంబ సభ్యు లు, ఇటు కాలనీవాసుల రోదనలు మిన్నం టాయి. ముగ్గురు యువతుల మృతితో గాంధీ నగర్‌లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నా యి. వివాహమైన యువతుల అత్తవారి ఇళ్లలో కూడా తీవ్ర విషాదం నింపింది. అసలు ఏమైం ది.. ఆత్మహత్యకు గల కారణాలేమిటి అనేది తెలియదంటూ మృతుల బంధువులు రోదిస్తుం డగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తన్నామని పోలీసులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News