Thursday, April 25, 2024

థ్రిల్లర్ సినిమా

- Advertisement -
- Advertisement -

Thriller movie

శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ పతాకంపై తల్లాడ శ్రీనివాస్ నిర్మాతగా వివేకానంద విక్రాంత్ దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘దక్ష’.ఈ సిని మా ద్వారా సీనియర్ నటుడు శరత్ బాబు తనయుడు ఆయుష్ హీరోగా వెండితెరకు పరిచయమవుతున్నాడు. ఈ సినిమా టైటిల్ లోగోను తనికెళ్ళ భరణి, శరత్ బాబు విడుదల చేశారు. శరత్ బాబు మాట్లాడుతూ “ఆయుష్ నా తమ్ముడి కొడుకు, నా కొడు కు కూడా. ఈ చిత్రం మంచి విజ యం సాధించాలి అని కోరుకుంటున్నాను”అని అన్నా రు. దర్శకుడు వివేకానంద విక్రాంత్ మాట్లాడుతూ “దర్శకుడిగా ‘దక్ష’ నా మొదటి చిత్రం. సినిమా చాలా బాగా వచ్చింది”అని తెలిపారు. హీరో ఆయుష్ మాట్లాడుతూ “హైదరాబాద్, అరకు, ఖమ్మం లాంటి ఎన్నో లొకేషన్స్‌లో సినిమా షూటింగ్ చేశాము. ఇది ఒక థ్రిల్లర్ సినిమా. వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో ఈ సినిమా విడుదలవుతుంది”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్లు అను, నక్షత్ర, నిర్మాత తల్లాడ సాయికృష్ణ, నటుడు తల్లాడ వెంకన్న పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News