Thursday, April 25, 2024

ఒంటరి మహిళపై దుండగుల దాడి

- Advertisement -
- Advertisement -

Thugs attack woman in wyra

వైరా: గుర్తుతెలియని దుండగులు ఓ మహిళ కాళ్ళు, చేతులు కట్టేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటన వైరా మండల పరిధిలోని స్టేజి పినపాక గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు అందించిన సమాచారం ప్రకారం.. ఒంటరిగా స్టేజి పినపాకలో నివాసం ఉంటున్న షేక్ దుర్గాబి ఇంట్లోకి చొరబడిన గుర్తుతెలియని వ్యక్తులు ఆమె నోట్లో గుడ్డలు కుక్కి, కాళ్లుచేతులను తాడుతో కట్టేసి తీవ్రంగా గాయపరిచారు. దీంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఉదయం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దుర్గాబిని ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. ఇటీవలే ఆమె తన ఆస్తి తనకు ఇప్పించాలని వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపింది. ఆస్తికోసమే తన సమీప బందువులు తనపై దాడి చేసి ఉండవచ్చునని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వైరా ఎస్‌ఐ సురేష్ తెలిపారు.

Thugs attack woman in wyra

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News