Thursday, April 25, 2024

జానంపేట గ్రామంలో దారుణం..

- Advertisement -
- Advertisement -

Thugs strangle an 8 year old boy in Mahabubnagar

ముసాపేట : మండల పరిధిలోని జానంపేట గ్రామానికి చెందిన పుట్ట విష్ణు, లక్ష్మిల కుమారుడు సంతోష్ (8) రెండు రోజుల కింద కనిపించకుండా పోయాడు. బుధవారం వెలిమ దేవేందర్ బావిలో పుల్లారావు అనే వ్యక్తి బావి దగ్గర మోటార్ పెట్టడానికి వెళ్తే చీరలో చుట్టిపైకి తేలుతూ శవం కనిపించడంతో భయంతో గ్రామంలోకి వెళ్లి పలువురికి తెలుపగా గ్రామ సర్పంచ్ శ్రీనివాసులు పోలీసులకు సమాచారం అందించారు. గ్రామం నుండి జనాలు చూడటానికి పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. పోలీసులు శవాన్ని బయటకి తీసి చూస్తే బాలుడు సంతోష్‌ది శవమని తెలిపారు. గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి.

తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం

క్లూస్ టీం అక్కడికి జాగిలాలతో వచ్చి పరిశీలించగా రెండు రోజులు బావిలో ఉన్నందున ఎటువంటి ఆధారం లభించలేదు. కేసు దర్యాప్తు చేసి విచారణ చేపడుతున్నామని ఎస్‌ఐ పర్వతాలు తెలిపారు. బాలుడి తండ్రి విష్ణును పోలీసులు అడగగా మల్లేష్ సన్నాఫ్ వెంకటయ్య మీద అనుమానం ఉందని, నాకు ఇద్దరు భార్యలు మొదటి భార్యకు ఇద్దరు పిల్లలు , నన్ను వదిలి వెళ్లి పోయింది. నా మొదటి భార్య వైపు నుండి కూడా విచారణ చేపట్టినా కడుపు కోతకు కారణం అయిన వారిని కఠినంగా శిక్షించాలని తెలిపినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News