- Advertisement -
నాగర్కర్నూల్: ఓ మహిళపై అత్యాచారం చేసిన దుండగులు ఆ తరువాత ఆమె గొంతుకోసి చంపిన ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని అమ్రాబాద్ మండలం, బట్టవర్లపల్లి అటవీప్రాంతం వద్ద ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. అటుగా వెల్లిన పశువుల కాపరులు మహిళ మృతదేహాన్ని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళ మృతదేహాన్ని పరిశీలించారు. అక్కడున్న ఆనవాళ్ల కోసం పోలీసులు గాలించారు. కాగా, మహిళను అత్యాచారం చేసిన దుండగులు, గొంతుకోసి చంపినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. మహిళ ఆనవాళ్ల ఆధారంగా ఆమె ముంబయికి చెందినదిగా పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అనంతరం, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రిలోని మార్చూరీకి తరలించారు. కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు.
Thugs who Raped and Strangled Woman
- Advertisement -