- Advertisement -
భీమారం: మంచిర్యాల జిల్లా భీమారం మండలం కాజీపేట అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచిరించింది. మేతకు వెళ్లిన పశువులపై పులి దాడి చేయడంతో రైతులు పరుగులు తీశారు. పులి దాడిలో రెండు పశువులు మృతి చెందాయని అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు. దీంతో చుట్టుపక్కల గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. పులి ఎప్పుడు ఎక్కడ ఎవరి మీద దాడి చేస్తోందని భయంతో ప్రజలు కాలం గడుపుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు సూచిస్తున్నారు.
- Advertisement -