లక్నో: ఉత్తరప్రదేశ్ పోలీసులు జరిపిన కాల్పుల్లో వాంటెడ్ క్రమినల్ టింకూ కపాలా మృతి చెందాడు. బారాబంకిలో టింకూ కపాలాను హతమార్చినట్టు పోలీసులు తెలిపారు. 3 వారాల క్రితం గ్యాంగ్స్టర్ వికాస్ దూబే మట్టుబెట్టిన యుపి పోలీసులు శనివారం మరో వాంటెడ్ క్రమినల్ టింకూ కపాలా పనిపట్టారు. స్పెషల్ టాస్క్ఫోర్స్ పోలీసులు నిర్వహించిన ఈ ఆపరేషన్ లో టింకూ తీవ్రంగా గాయపడ్డాడని, అతడిని ఆస్పత్రికి తీసుకువెళ్లేలోపు చనిపోయినట్టు బారాబంకి ఎస్పీ అరవింద్ చతుర్వేది తెలిపారు. టింకూపై రూ. లక్ష రివార్డు అన్నట్టు ఆయన తెలిపారు. దోపిడి, హత్య కేసులు ఏడాది నుంచి ఈ నిందితుడు పరారీలో ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. ఈ కాల్పుల్లో టింకూ అనుచరుడు తప్పించుకున్నాడు. లఖ్ నవూ, మహారాష్ట్రలో టింకూ కపాలాపై 27 కేసులు ఉన్నాయని పోలీసులు పేర్కొన్నారు.
Tinku Kapala killed in encounter by UP police