Wednesday, April 24, 2024

చౌటుప్పల్‌లో ప్రైవేటు బస్సును ఢీకొట్టిన టిప్పర్‌..

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి: జిల్లాలోని చౌటుప్పల్‌ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని లక్కారం వద్ద రహదారిపై కాకినాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆరంజ్ ట్రావెల్ ప్రైవేటు బస్సును టిప్పర్‌ ఢీకొట్టింది. దీంతో బస్సు క్యాబిన్ లో డ్రైవర్ ఇరుక్కోగా.. మరో 15మంది ప్రయాణికులు గాయపడినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని చికిత్స కోసం చౌటుప్పల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tipper hits Private Travel Bus at Choutuppal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News