- Advertisement -
హైదరాబాద్: శ్రీ వెేంకటేశ్వర స్వామి వారి భక్తులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల శ్రీ వారి లడ్డూ ప్రసాదం రేపటి (ఆదివారం) నుంచి హైదరాబాద్ లో కూడా భక్తులకు అందుబాటులోకి రానుంది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించటంతో గత 67 రోజులకు పైగా స్వామి వారి ఆలయంలో భక్తులకు దర్శనాలు నిలిపివేశారు. అయితే భక్తులకు శ్రీవారి ఆశీస్సులు కనీసం ప్రసాదం రూపంలో అయినా అందించాలనే ఉద్దేశ్యంతో టిటిడి బోర్డు రూ.25 లకే లడ్డూను భక్తులకు అందింస్తున్నారు. హిమాయత్నగర్ టిటిడి కార్యాలయంలో కౌంటర్ల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకుని లడ్డూ విక్రయాలను చేపట్టనున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు లడ్డూ ప్రసాదం అందుబాటులో ఉండనుంది. హైదరాబాద్లో రోజుకు 60వేల లడ్డూలు విక్రయించాలని టిటిడి నిర్ణయించింది.
- Advertisement -