- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద్: నగరంలో శ్రీవారి లడ్డూ ప్రసాద విక్రయాలు ముగిశాయి. హిమాయత్నగర్ టిటిడి బాలాజీ భవన్లో నాలుగు రోజుల పాటు లడ్డూలను విక్రయించారు. దాదాపు రెండు లక్షల 75వేల లడ్డూ ప్రసాదాల అమ్ముడుపోయాయని అధికారులు తెలిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు లడ్డూలను కొనుగోలు చేయగా, ఒక్కో లడ్డూను రూ.25 చొప్పున టిటిడి అధికారులు విక్రయించారు. నాలుగు రోజుల పాటు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు టిటిడి లడ్డూలను విక్రయించింది.
Tirumala Srivari Laddus sales closed in Hyderabad
- Advertisement -