Wednesday, April 24, 2024

కరోనాతో తిరుపతి ఎంపి దుర్గా ప్రసాద్ మృతి

- Advertisement -
- Advertisement -

 

చెన్నై: కరోనా వైరస్ సోకి తిరుపతి ఎంపి బల్లి దుర్గా ప్రసాద్ (64) బుధవారం కన్నుమూశారు. ఇటీవల కరోనా వైరస్ సోకడంతో చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. దుర్గా ప్రసాద్ కు గుండెపోటు రావడంతో ఆస్పత్రిలోనే చనిపోయారు. దీంతో దుర్గా ప్రసాద్ కుటుంబంలో శోకసంద్రంలో మునిగిపోయింది. 2019 ఎన్నికలలో వైఎస్ఆర్ సిపి నుంచి తిరుపతి ఎంపిగా పోటీ చేసి గెలుపొందారు. 1994లో చంద్రబాబు మంత్రి వర్గంలో విద్యాశాఖ మంత్రిగా కూడా పని చేశారు.  నెల్లూరుజిల్లా గూడురు నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు గెలిచి ప్రజలకు సేవ చేశారు. ఎంపి దుర్గా ప్రసాద్ మృతి పట్ల సిఎం జగన్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుమారుడితో ఫోన్ లో మాట్లాడి, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News