Friday, April 26, 2024

చిల్లీస్ హబ్ గా ఖమ్మం: పువ్వాడ

- Advertisement -
- Advertisement -

ఖమ్మం: అంతర్జాతీయ మార్కెట్ కు చిరునామాగా ఖమ్మం మార్కెట్ ను తీర్చిదిద్దుతామని చిల్లీస్ కు హబ్ గా మారుస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో తేజ రకం కొత్త మిర్చికి రికార్డు స్థాయిలో ధర పలికింది. ఖమ్మం మార్కెట్ చరిత్రలో అత్యధికంగా క్వింటాల్‌ మిర్చికి రూ. 25,550 పలకడం ఇదే ప్రథమం. సోమవారం ఖమ్మం వ్యవసాయ మిర్చి మార్కెట్ నందు నిర్వహించిన జెండా పాటలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొని జెండా పట్టి ధర నిర్ణయించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వంలో ఖమ్మం మిర్చి మార్కెట్ లో రికార్డు స్థాయిలో ధర పలికింది అని పేర్కొన్నారు. కొన్ని క్వింటాలే కాదు…రైతులు పండించిన ప్రతి బస్తాలను కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక వ్యవసాయం లాభసాటిగా మారిందని, మనం పండించే మిర్చి అంతర్జాతీయ స్థాయిలో మంచి డిమాండ్ ఉందన్నారు. చైనా దేశం మిర్చి కంపెనీలు ఖమ్మంలో ఏర్పాటు చేసి విధంగా తయారు చేస్తామని, చైనాకు క్వాలిటీ మిర్చి ఎగుమతి చేస్తున్నామని, మిర్చి ఘాట్ కంటే రైతుల మీద ప్రేమ ఎక్కువ అని, అందుకే రైతుల ప్రయోజనాలు ముఖ్యమని పువ్వాడ స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News