Saturday, April 20, 2024

నిరాశ పరిచిన అతాను దాస్..

- Advertisement -
- Advertisement -

టోక్యో: ఒలింపిక్స్‌లో భారత్‌కు కచ్చితంగా పతకం లభిస్తుందని భావించిన క్రీడాంశాల్లో ఆర్చరీ ఒకటి. అయితే ఆర్చరీలో భారత క్రీడాకారులు పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరిచారు. ఇప్పటికే టీమ్ విభాగం, మహిళల వ్యక్తిగత విభాగంలో పతకం ఆశలు ఆవిరి కాగా, తాజాగా పురుషుల ఆర్చరీలో అతాను దాస్ కూడా ఇంటిదారి పట్టాడు. దీంతో ఆర్చరీలో భారత్ పతకం ఆశలు నీరుగారాయి. శనివారం జరిగిన పురుషుల ఆర్చరీ వ్యక్తిగత విభాగం ప్రిక్వార్టర్ ఫైనల్లో భారత అగ్రశ్రేణి ఆర్చర్ అతాను దాస్ ఓటమి పాలయ్యాడు. జపాన్ ఆటగాడు తాకాహరు పురుకవాతో జరిగిన పోరులో అతాను దాస్ పరాజయం చవిచూశాడు. విజయం కోసం చివరి వరకు గట్టిగానే పోరాడినా ఫలితం లేకుండా పోయింది. తొలి సెట్‌లో చేసిన చిన్న పొరపాటుతో దాస్ ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదారి పట్టక తప్పలేదు.
Tokyo Olympics: Atanu das loses in Archer quarterfinals

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News