Friday, March 29, 2024

టోక్యో ఒలింపిక్స్: క్వార్ట‌ర్‌ఫైన‌ల్ లో భారత బాక్స‌ర్ ఓటమి..

- Advertisement -
- Advertisement -

టోక్యో: ఒలింపిక్స్ బాక్సింగ్ క్వార్ట‌ర్‌ఫైన‌ల్ మ్యాచ్‌లో ఇండియ‌ాకు నిరాశే మిగిలింది. 91 కేజీల కేట‌గిరీలో ఆదివారం జరిగిన క్వార్ట‌ర్‌ఫైన‌ల్ లో ఉజ్బెకిస్థాన్ బాక్స‌ర్ జలలోవ్ చేతిలో భారత బాక్స‌ర్ స‌తీష్‌కుమార్‌ ఓటమిపాలయ్యాడు. తొలి రౌండ్ నుంచే స‌తీష్‌పై పూర్తిగా పైచేయి సాధించిన జ‌ల‌లోవ్‌ 0-5తేడాతో గెలుపొందాడు. దీంతో ఒలింపిక్స్ పతకంపై ఆశలు రేపిన స‌తీష్‌ కుమార్‌ క్వార్టర్ ఫైనల్లోనే ఇంటిరారి పట్టాడు.ఇక, నిన్న జరిగిన 52 కిలోల విభాగం ప్రిక్వార్టర్ ఫైనల్‌లో అమిత్ పంగల్ కూడా ఓటమితో వెనుదిరిగిన విషయం తెలిసిందే.

Tokyo Olympics: Satish Kumar losses in boxing quarterfinals

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News