Friday, March 29, 2024

లోయలో పడ్డ టూరిస్ట్ బస్సు: 10 మందికి గాయాలు

- Advertisement -
- Advertisement -

Tourist bus falls into valley: 10 injured

అమ‌రావ‌తి: ఆంధ్ర‌ప్ర‌దేశ్ అల్లూరి సీతారామ‌రాజు (ఏఎస్‌ఆర్) జిల్లాలో ఓ టూరిస్టు బ‌స్సు ఆదివారం ప్ర‌మాదానికి గురైంది. ప‌ర్యాట‌కుల‌తో వెళ్తున్న బ‌స్సు జిల్లాలోని వ‌న‌జాంగి వ‌ద్ద అదుపుత‌ప్పి కొండ‌పై నుంచి లోయ‌లో ప‌డింది. బ‌స్సు విశాఖ‌ప‌ట్నం నుంచి పాడేరుకు వెళ్తుండ‌గా ఈ ఘటన జరిగింది. స్థానికులు గ‌మ‌నించి పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. హూటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బ‌స్సులో చిక్కుకున్న వారిని వెలికితీశారు. అనతరం గాయపడిన 10 మందిని చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News