Friday, March 29, 2024

కొండా విశ్వేశ్వరరెడ్డిని కలిసిన రేవంత్

- Advertisement -
- Advertisement -

TPCC Revanth Reddy Met Konda Vishweshwar Reddy

హైదరాబాద్: చేవెళ్ల మాజీ ఎంపి కొండా విశ్వేశ్వరరెడ్డిని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ కలిశారు. కొండా నివాసానికి వెళ్లిన రేవంత్ తాజా రాజకీయ పరిస్థితులపై ఆయనతో చర్చించారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక తర్వాత కొండా విశ్వేశ్వరరెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీని వీడిన తర్వాత ఆయన పలు పార్టీ నేతలతో భేటీ అయినప్పటికీ ఇంతవరకు ఏ రాజకీయ పార్టీలోనూ చేరలేదు. అప్పట్లో ఈటల బిజెపిలో చేరే సమయంలో కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా కాషాయ తీర్థం పుచ్చుకుంటారని జోరుగా ప్రచారం సాగింది. కానీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఏ నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో కొండాతో రేవంత్‌రెడ్డి భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో కొండా విశ్వేశ్వరరెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుతారనే ఊహాగానాలు వినవస్తున్నాయి.

TPCC Revanth Reddy Met Konda Vishweshwar Reddy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News