Friday, April 26, 2024

అత్యాచార బాధితురాలు, తల్లిని ట్రాక్టర్ తో తొక్కించి…..

- Advertisement -
- Advertisement -

Tractor over survivor-mother by rapist at UP

లక్నో: అత్యాచార బాధితురాలిని, ఆమె తల్లిని నిందితుడు టాక్టర్‌తో ఢీకొట్టి చంపిన సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని కస్‌గంజ్ జిల్లాలో మంగళవారం సాయంత్రం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. యశ్‌వీర్ అనే వ్యక్తి 2016 జులైలో ఇంటి పక్కన ఉండే 13 ఏళ్ల అమ్మాయిపై అత్యాచారం చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి యశ్‌వీర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 2017లో బెయిల్‌పై యశ్‌వీర్ విడుదలయ్యాడు. అప్పటి నుంచి బాధితురాలుని చంపాలని నిర్ణయం తీసుకున్నాడు. మంగళవారం సాయంత్ర బాధితురాలు తన తల్లితో కలిసి సైకిల్‌పై ఇంటికి వెళ్తుండగా నిందితుడు ట్రాక్టర్‌తో వాళ్లను ఢీకొట్టాడు. కింద పడిన తరువాత వాళ్లను టాక్టర్‌తో తొక్కించాడు. వాళ్లు చనిపోయారని నిర్ధారణ చేసుకున్న తరువాత ఘటనా స్థలం నుంచి పారిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. భూతగాదాల్లో బాధితురాలి తండ్రి తన తండ్రిని హత్య చేశాడని యశ్‌వీర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రెండు కుటుంబాల మధ్య ఘర్షణలు ఉండడంతోనే హత్యలు జరిగి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News