- Advertisement -
ఆదేశాలు జారీ చేసిన ట్రాఫిక్ డిసిపి
హైదరాబాద్: విడిసిసి రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్న కారణంగా అల్లాపూర్ నుంచి మాదాపూర్ మేయిన్ రోడ్డుపై ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ సైబరాబాద్ ట్రాఫిక్ డిసిపి ఎస్ఎం విజయ్కుమార్ ఆదేశాలు జారీ చేశారు. జిహెచ్ఎంసి విడిసిసి రోడ్డు నిర్మిస్తున్నారు. వార్డు నంబర్ 116, మూసాపేట సర్కిల్ 23లో ఈ నెల 1వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఆంక్షలు విధించారు. బోరబండ నుంచి హైటెక్సిటీకి వచ్చే వాహనాలు పద్మారావు నగర్ కాలనీ సమీపంలోని అబ్బు బాయి బీఫ్ షాప్ మీదుగా సున్నం చెరువు పిల్లి దర్గా వైపు మళ్లిస్తారు. హైటెక్సిటీ నుంచి బోరబండ వైపు వచ్చే వాహనాలు గాయత్రినగర్ ఔట్పోస్టు సమీపంలోని పద్మావతి టిఫిన్ సెంటర్ మీదుగా సున్నం చెరువు వైపు పంపిస్తారు. వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయమార్గాల్లో వెళ్లాలని కోరారు.
- Advertisement -