- Advertisement -
హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో సిఎం కెసిఆర్ శనివారం నిర్వహించే బహిరంగ సభ సందర్భంగా మధ్యాహ్నం 3గంటల నుంచి రాత్రి 8గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించబడ్డాయి. మధ్యాహ్నం 3గంటల నుంచి ఎల్బీ స్టేడియం వద్ద వాహనాలకు అనుమతి లేదని పోలీసులు వెల్లడించారు. సికింద్రాబాద్ నుంచి సభకు వచ్చే వాళ్లకు పబ్లిక్ గార్డెన్, రవీంద్రభారతి, డాక్టర్ కార్స్ ప్రాంతాల్లో పార్కింగ్ కు అనుమతి ఇచ్చారు. ఎల్బీనగర్, దిల్ సుఖ్ నగర్, పాతబస్తీ నుంచి వచ్చే వాహనాలకు పీపుల్స్ ప్లాజా వద్ద పార్కింగ్ కు వాహనాలను పార్క్ చేసుకోవచ్చు. ముషీరాబాద్, మెహిదిపట్నం నుంచి వచ్చే వాహనాలకు నిజాం కాలేజీ గ్రౌండ్స్ లో పార్కింగ్ చేసుకోవచ్చని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
- Advertisement -