గురుగోవింద్ సింగ్ 354 పుట్టిన రోజు వేడుకలు
హైదరాబాద్: గురుగోవింద్ సింగ్ 354 పుట్టిన రోజు వేడుకల సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ అదనపు అనిల్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు ఈ నెల 18వ తేదీన 3 గంటల నుంచి రాత్రి 11.30 వరకు అమలులో ఉంటాయి. సిక్కుల పదో గురువు గురుగోవింద్ సింగ్ సందర్భంగా ర్యాలీ నిర్వహించనున్నారు. ర్యాలీ సెంట్రల్ గురుద్వారా సాహెబ్, గౌలిగూడ నుంచి వయా శంకర్ షేర్ హోటల్ నుంచి గురుద్వారా శ్రీ గురు సింగ్ సాహెబ్ అశోక్ బజార్, ఆఫ్జల్గంజ్ ఐస్ల్యాండ్, అఫ్జల్ గంజ్ టి జంక్షన్, సిద్దింబజార్ , మోజంజాహీ మార్కెట్, జాంబాగ్, పుత్లీబౌలి, రామ్ మందిర్ అక్కడి నుంచి రిటర్న్ సెంట్రల్ గురు దర్వాజ సాహెబ్, గౌలిగూడ మీదుగా నిర్వహించనున్నారు. ర్యాలీ సందర్భంగా సుల్తాన్బజార్, చార్మినార్, గోషామహల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని కోరారు.