Thursday, April 25, 2024

నా భర్త అందరికీ ప్రేరణ

- Advertisement -
- Advertisement -

Trainee collector Santhoshi says about her Husband sacrifice

 

యాదాద్రి భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో గణతంత్ర వేడుకలు నిరాడంబరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా.. గాల్వాన్ లోయలో జరిగిన చైనా సైనికుల దాడిని తిప్పికొడుతూ అమరుడైన కల్నల్ సంతోష్ బాబు సతీమణి సంతోషిని జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్, ఆలేరు ఎంఎల్ఎ గొంగిడి సునీత శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా సంతోషి మాట్లాడుతూ.. కేంద్రం తన భర్త సంతోష్ బాబుకు అవార్డు ప్రకటించడం పట్ల గర్వంగా ఉందన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన తన భర్త అందరికీ ప్రేరణగా ఉంటారన్నారు. తన పిల్లలు వారి నాన్నను చూసి గర్విస్తున్నారని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వానికి ఆమె కృతజతలు తెలిపారు. కల్నల్ సంతోష్ బాబు సేవలను స్మరిస్తూ కేంద్ర ప్రభుత్వం మహావీర్ చక్ర పురస్కారాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News