- Advertisement -
హైదరాబాద్ : పోలీస్ డిపార్ట్మెంట్లోని అన్ని విభాగలు సమన్వయంతో పనిచేస్తేనే శాంతిభద్రతలు అదుపులో ఉంటాయని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్భగవత్ అన్నారు. ఇబ్రహింపట్నం మూడో బెటాలియన్లో శిక్షణ పొందుతున్న ట్రైనీ ఎఆర్ కానిస్టేబుళ్లు నేరేడ్మెట్లో రాచకొండ పోలీస్ కమిషనరేట్ కార్యాలయాన్ని బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా సిపి మహేష్ భగవత్ వారికి వివిధ విభాగాల పనితీరు, స్పెషలైజేషన్ గురించి వారికి వివరించారు. పోలీస్ శాఖ ప్రత్యేకతలు, శాంతిభద్రతల విషయంలో తీసుకునే నిర్ణయాలను గురించి వివరించారు. ఏఆర్ డ్యూటీపై అవగాహన కల్పించారు.
Trainee PCs Visiting CP Office
- Advertisement -