Saturday, April 20, 2024

ఆప్ తరఫున గెలిచిన ట్రాన్స్‌జెండర్ బాబీ కిన్నర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఢిల్లీ మునిపల్ ఎన్నికల్లో ఆప్ తరఫున ట్రాన్స్‌జెండర్ బాబీ కిన్నర్ సుల్తాన్‌పురీ స్థానం నుంచి గెలుపొందింది. దేశరాజధాని ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌లో తొలి ట్రాన్స్‌జెండర్ కౌన్సిలర్‌గా రికారుల్లోకి ఎక్కింది. మజ్రా అసెంబ్లీ నియోజకవర్గంలోని సుల్తాన్‌పురి వార్డునుంచి బాబీ బుధవారం విజయం సాధించిందని అధికారులు తెలిపారు.

బాబీ కాంగ్రెస్ అభ్యర్థి ఢాకాపై 6,174 ఓట్ల తేడాతో గెలిచింది. విజయం సాధించిన అనంతరం బాబీ మీడియాతో మాట్లాడుతూ తన విజయం కోసం కష్టపడి పనిచేసి ప్రజలకు తన విక్టరీని అంకితమిస్తున్నాన్నాని తెలిపారు. ప్రతి ఒక్కరి కృతజ్ఞతలు తెలుపుతున్నాను నా వార్డు ప్రజల అభివృద్ధికి చేస్తాను అని బాబీ తెలిపింది. కాగా ఎన్నికల్లోనూ బాబీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసింది. అన్నాహజారే ఉదమం తర్వాత రాజకీయపార్టీగా అవతరించిన ఆప్‌తో కలిసి బాబీ పనిచేస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News