Thursday, April 25, 2024

నిర్మల్‌ లో ట్రావెల్ బస్సు బోల్తా.. 17మందికి తీవ్ర గాయాలు

- Advertisement -
- Advertisement -

Travel Bus Overturned at Kondapur Bypass in Nirmal

నిర్మల్‌: జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని కొండాపూర్‌ బైపాస్‌ వద్ద బుధవారం తెల్లవారుజామున ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో 17మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడగా, మరో 15మంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన వారిని చికిత్స కోసం నిర్మల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ట్రావెల్స్‌ బస్సు హైదరాబాద్‌ నుంచి ఉత్తరప్రదేశ్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో 80మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Travel Bus Overturned at Kondapur Bypass in Nirmal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News