Thursday, March 28, 2024

పెళ్లి రోజు సందర్భంగా మొక్కలు నాటిన టిఆర్ఎస్ నేత అగయ్య హైమావతి

- Advertisement -
- Advertisement -

Trees are planted in Green India challenge

రాజన్నసిరిసిల్ల: ఎంపి రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్  ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా తమ పెళ్లి రోజు సందర్భంగా మొక్కలు నాటడం జరిగిందని రాజన్న సిరిసిల్ల జిల్లా టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జీ తోట అగయ్య హైమావతి తెలిపారు. ఈ సందర్భంగా తోట ఆగయ్య మాట్లాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రవేశపెట్టిన అద్భుతమైన పథకం హరితహరం కార్యక్రమం కి తోడుగా ఎంపీ సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం స్థాపించి అద్భుతంగా ముందుకు సాగుతుందని ప్రశంసించారు. ఇందులో బాగంగా మొక్కలు నాటడం సంతోషాన్ని ఇచ్చిందన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు తమ వంతుగా పర్యావరణానికి మేలు కలిగించే ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి అని సూచించారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News