Friday, March 29, 2024

ప్రతి గ్రామాన్ని వాటితో నందనవనంలా మార్చుకోవాలి: జగదీష్

- Advertisement -
- Advertisement -

Jagadish Reddy

 

నల్లగొండ: గ్రామాల్లో గుణాత్మక మార్పు కోసం సిఎం కెసిఆర్ పల్లె ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని మంత్రి జగదీష్ రెడ్డి ప్రశంసించారు. నల్లగొండలో జరిగిన పంచాయతీరాజ్ సమ్మేళనం కార్యక్రమంలో జగదీష్ రెడ్డి మాట్లాడారు. ప్రతి గ్రామాన్ని మొక్కలు నాటి నందనవనంలా మార్చుకోవాలని సూచించారు. ప్రతీ నెల పల్లెల బాగుకోసం సిఎం కెసిఆర్ నిధులు విడుదల చేశారని, తెలంగాణ అన్ని రంగాల్లో ముందు ఉంచాలన్నదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. పట్టణ ప్రగతిని కూడా అందరూ కలిసి విజయంవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండలి విప్ కర్నె ప్రభాకర్, జడ్‌పి చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, ఎంపి బడుగుల లింగయ్య, ఎంఎల్‌సి తేరా చిన్నపరెడ్డి, ఎంఎల్‌ఎలు కిశోర్ కుమార్, రవీంద్రకుమార్, చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్‌రెడ్డి, భాస్కర్ రావు తదితరలు హాజరయ్యారు.

 

Trees are planting in every village is greenary
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News