- Advertisement -
హైదరాబాద్ : థాయిలాండ్ అతిపెద్ద ఎల్ఇడి టీవీల తయారీదారు ట్రీవ్యూ భారతదేశంలో స్మార్ట్ టీవీల శ్రేణిని ప్రారంభించింది. ఎపి, తెలంగాణలోకి ప్రవేశించిన ఈ సంస్థ తక్కువ ధరలకే తన ఉత్పత్తులను అందిస్తోంది. 32 అంగుళాల టివి రూ.11,990 ప్రారంభ ధర నుంచి 4కె 65 అంగుళాల టీవీ రూ.45,990 వరకు ఉన్నాయి. ఇప్పటికే ఈ సంస్థ భారతదేశం, మధ్యప్రాచ్యం, ఆఫ్రికన్ దేశాలలో క్యూట్రీ వెంచర్స్తో భాగస్వామ్యం కలిగి ఉంది. బాలీవుడ్ నటుడు, స్టైల్ ఐకాన్ హృతిక్ రోషన్ భారతదేశంలో ట్రీవ్యూకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్నారు.
Treeview entres India television market
- Advertisement -