Friday, April 19, 2024

స్టార్లతో త్రిష హ్యాట్రిక్ మూవీ..

- Advertisement -
- Advertisement -

అందాల తార త్రిషకి మళ్ళీ క్రేజ్ పెరుగుతోంది. 40 ఏళ్ల వయసులో ఆమెకి హీరోయిన్‌గా ఎక్కువ ఛాన్సులు రావడం అంటే మాటలు కాదు కదా. మణిరత్నం తీసిన ‘పొన్నియన్ సెల్వన్’ సినిమాలో ఆమె యువరాణిగా కనిపించి అదరగొట్టింది. తన వయసు కన్నా చాలా చిన్నగా అగుపించింది. అందుకే, ఆమెకి ఇప్పుడు ఇంత క్రేజ్. మణిరత్నం తన తదుపరి చిత్రాన్ని కమల్ హాసన్ హీరోగా తెరకెక్కించనున్నారు.

ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్‌గా త్రిషనే తీసుకోవాలనుకుంటున్నారట. ఇలా ఆమె మరో బిగ్ ఛాన్స్ పట్టేసింది. త్రిష ఇంతకుముందు మణిరత్నం తీసిన ‘యువ’, ‘పొన్నియన్ సెల్వన్’ చిత్రాల్లో నటించింది. ఇది మూడో చిత్రం కానుంది. అలాగే, కమల్ హాసన్ సరసన ఆమె ఇప్పటివరకు రెండు చిత్రాల్లో కనిపించింది. ఒకటి ‘మన్మథ బాణం’. మరొకటి ‘చీకటి రాజ్యం’. ఇప్పుడు ఇది మూడో అవకాశం. ఒకవేళ ఈ సినిమాలో త్రిష నటిస్తే ఆమెకి దర్శకుడితోనూ, హీరోతోనూ హ్యాట్రిక్ మూవీ అవుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News