- Advertisement -
ముంబయి: టెలివిజన్ రేటింగ్ పాయింట్స్(టిఆర్పి) కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న రిపబ్లిక్ టివి చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్(సిఎఫ్ఒ) ముంబయి పోలీసుల ముందు హజరయ్యేందుకు నిరాకరించారు. శనివారం హాజరు కావాల్సిందిగా పోలీసులు ఆయనకు సమన్లు జారీ చేశారు. సిఎఫ్ఒ శివ సుబ్రహ్మణ్యం సుందరం దీనిపై వివరణ ఇస్తూ తాను సుప్రీంకోర్టులో పిటిషన్ వేశానని, వారం రోజుల్లో అది విచారణకు వస్తున్నందున హాజరు కావాల్సిన అవసరం లేదని తెలిపారు. ఇదే కేసులో మాడిసన్ వరల్డ్ అండ్ మాడిసన్ కమ్యూనికేషన్స్ చైర్మన్ శ్యామ్ బల్సారా మాత్రం పోలీసుల ముందు హాజరై వాంగ్మూలమిచ్చారు.
- Advertisement -