- Advertisement -
మనతెలంగాణ/రేగొండ: హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అధ్యక్షతన ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజా ప్రతినిధులతో ఆత్మీయ సమ్మేళనం శుక్రవారం ఏర్పాటు చేశారు. ఈ సమ్మేళనంలో రేగొండ మండల టిఆర్ఎస్ నాయకులు మంత్రి కెటిఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. మంత్రి కెటిఆర్ ను కలిసిన వారిలో రేగొండ ఎంపిపి పున్నం లక్ష్మీ రవి, జడ్పిటిసి సాయిని విజయముత్యం, గోరికొత్తపల్లి మండలాధ్యక్షుడు మటిక సంతోష్, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -