Saturday, April 20, 2024

టిఆర్ఎస్ ఎంఎల్ఎ గువ్వల బాలరాజుపై దాడి…

- Advertisement -
- Advertisement -

 

కోఆపరేటీవ్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీ వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో టిఆర్ఎస్ అచ్చంపేట ఎంఎల్ఎ గువ్వల బాలరాజు గాయపడ్డారు. శనివారం నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలంలో జరిగిన సహకార ఎన్నికల్లో పోలింగ్ సెంటర్ వద్ద ఇరువర్గాలు గొడవకు దిగారు. అక్కడే ఉన్న ఎంఎల్ఎ గువ్వల బాలరాజుపై కూడా కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. దీంతో ఆయన కుడికంటికి గాయమైంది. వెంటనే ఎంఎల్ఎని ఆస్పత్రికి తరలించారు. ఈ గొడవలో బ్యాలెట్ పేపర్లు, ఫర్నిచర్ ధ్వంసం అయ్యాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఎన్నికల అధికారులు ఎన్నికను వాయిదా వేశారు.

TRS MLA Guvvala Balaraju injured at Cooperative Election

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News