Saturday, April 20, 2024

కెసిఆర్ ఒక్క సైగ చేస్తే రేవంత్ రెడ్డి గాలికి కొట్టుకుపోతాడు

- Advertisement -
- Advertisement -

TRS MLA Jeevan Reddy fire Revanth Reddy

హైదరాబాద్: కాంగ్రేస్ పార్టీకి నిన్నగాకమొన్న వచ్చిన రేవంత్ రెడ్డి లఫంగ మాటలు మాట్లాడుతున్నాడని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మండిపడ్డారు. గురువారం టీఆర్ఎస్ ఎల్ఫీ కార్యాలయంలో ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే ఏ.జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే ఆళ్ళ వెంకటేశ్వర్ రెడ్డిలు మీడియా సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ..’75 ఏళ్లుగా దేశాన్ని దోచుకుంది గాంధీ కుటుంబమే. ఉద్యోగాలు ఇవ్వలేదు అనే కాంగ్రేస్ మాటలను ఖండిస్తున్నాము. వడ్డీలేని రుణాలను మహిళలకు వేలకోట్లు ఇచ్చాము. రేవంత్ కి టీపీసీసీ అధ్యక్షుడుగా ఉద్యోగం ఇచ్చిందే కేసీఆర్. నిన్న సభలో రేవంత్ రెడ్డి చదువులేని సన్నాసి లాగా మాట్లాడారు. నలుగురు సిటీలు వేస్తున్నారని ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు. దళితులకు విద్యను దూరం చేస్తున్నారు అనే వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. ఆర్ఎస్ కుమార్ ప్రత్యేక ఎజెండాతో బీఎస్పీలో చేరారు. జానారెడ్డి నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి వరకు తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ అన్న మాటలు ప్రజలు నమ్మలేదు. తెలంగాణ రాష్ట్రంలో సోనియమ్మ రాజ్యం ఏంటో కానీ, రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లడం మాత్రం ఖాయం. తెలంగాణ టీడీపీ ఆఫీస్ కు రేవంత్ రెడ్డి షప్రాసి కాదా?. రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేయడంలో నెంబర్ వన్. కేసీఆర్ ఒక్క సైగ చేస్తే మూడు పిట్ల రేవంత్ రెడ్డి గాలికి కొట్టుకుపోతడు’ అని జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

అనంతరం ఎమ్మెల్యే ఆళ్ళ మాట్లాడుతూ.. రాజకీయ నేతల భాష చూస్తుంటే బాధ కలుగుతుందని, రాజకీయ నేతల భాష రాష్ట్ర యువతకు, ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారని టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఆళ్ళ వెంకటేశ్వర రెడ్డి విమర్శించారు. 40 ఏళ్ళు రాజకీయ చరిత్ర ఉన్న కాంగ్రేస్ నేతలు రేవంత్ రెడ్డి భాష చూసి అచ్చర్యం వ్యక్తం చేస్తున్నారన్నారు. దళితబంధును చూసి ఎందుకు బీజేపీ-కాంగ్రేస్ పార్టీలు భయపడుతున్నారని అన్నారు. ఇన్నేళ్లలో దళితుల అభివృద్ధి కోసం ఎవరైనా ఇలాంటి ఆలోచన చేశారా? అని ప్రశ్నించారు. దమ్ముంటే హుజురాబాద్ లో కాంగ్రేస్ పార్టీకి డిపాజిట్లు తెచ్చుకొని చూపించాలని సవాల్ చేశారు.

TRS MLA Jeevan Reddy fire Revanth Reddy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News