- Advertisement -
హైదరాబాద్: ఎల్బినగర్ ఎంఎల్ఎ సుధీర్ రెడ్డి కుటుంబసభ్యులకు కరోనా వైరస్ సోకింది. సుధీర్ రెడ్డి భార్యకు మూడు రోజుల క్రితం కరోనా నిర్ధారణ అయింది. శుక్రవారం ఇద్దరు కుమారులతో కలిసి సుధీర్ రెడ్డి కరోనా పరీక్షలు చేయించుకున్నారు. సుధీర్ రెడ్డితో పాటు ఇద్దరు కుమారులు, వంట మనిషికి కరోనా సోకినట్టు వైద్య పరీక్షల్లో తెలింది. దీంతో ఎంఎల్ఎ కుటుంబసభ్యులు హోం క్వారంటైన్ లో ఉన్నారు. తెలంగాణలో టిఆర్ఎస్ ఎంఎల్ఎలకు కరోనా భయం వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే పలువురు ఎంఎల్ఎలకు కరోనా మహమ్మారి సోకిన సంగతి తెలిసిందే.తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో కొత్తగా 2,256మందికి కోవిడ్ సోకింది.
- Advertisement -