Friday, April 19, 2024

తలొగ్గేది లేదు..

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు రావాలని ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నో టీసులివ్వడంపై ఎంఎల్‌సి కవిత స్పం దించారు. తాను ఈ నెల 10న మహి ళా రిజర్వేషన్ బిల్లును డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ వద్ద ధర్నా తలపెట్టానని, ఇంతలోనే తనకు ఇడి నోటీసులు వచ్చాయన్నారు. తెలంగాణ ఎప్పటికీ తలవంచబోదని కవిత ట్వీట్ చేశారు. “పార్లమెంటులో మహిళల ప్రాతిని థ్యం కోసం ఎప్పటినుంచో పెండింగ్ లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లు గు రించి డిమాండ్ చేస్తూ మేం శాంతియు త నిరసన తలపెట్టాం. మార్చి 10న ఢి ల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారత్ జా గృతి సహా దేశంలోని ప్రతిపక్ష పార్టీల నేతలు కలిసి నిరాహార దీక్ష చేయాలనుకున్నాం. మహిళా రిజర్వేషన్ బిల్లు పా ర్లమెంటులో ప్రవేశపెట్టి పాస్ అయ్యే లా చూడాలని బిజెపిని డిమాండ్ చే యాలని నిర్ణయించాం. ఈలోపు ఇడి నుంచి నాకు సమన్లు అందాయి.

మా ర్చి 9న ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి విచారణకు రావాలని ఆదేశించారు. బాధ్యత గల పౌరురాలిగా నేను విచారణ సంస్థలకు అన్ని విధాలుగా సహకరిస్తాను. ధర్నాతో పాటు నాకు ముందస్తుగా ఖరారైన కార్యక్రమాలు ఉన్నందున విచారణ తేదీ మార్పు విషయం లో న్యాయ నిపుణుల సలహా తీసుకుం టాను. బిఆర్‌ఎస్ పార్టీపై, మా నాయకుడు కెసిఆర్‌పై ప్రయోగిస్తున్న ఇలాం టి వ్యూహాలు మమ్మల్ని ఏమీ చేయలేవ ని కేంద్ర ప్రభుత్వానికి చెబుతున్నాను. బిఆర్‌ఎస్‌ను గానీ, కెసిఆర్‌ను గానీ మీ రు లొంగదీసుకోలేరు. కెసిఆర్ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వ విఫల విధానాలపై మేం పోరాడుతూనే ఉంటాం. దేశ భవిష్యత్తు కోసం మా గళాన్ని వినిపిస్తూనే ఉంటాం. ఢిల్లీలో అధికారంలో ఉన్నవారి ముందు తెలంగాణ ఎప్పటికీ తల వంచబోదనే విషయాన్ని మరోసా రి గుర్తు చేస్తున్నాను. ప్రజల హక్కుల కోసం నిర్భయంగా మేము పోరాడుతూనే ఉంటాం” అని కవిత ఓ ప్రకటన

ఢిల్లీకి చేరుకున్న కవిత
బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎసి కల్వకుంట్ల కవిత దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. ఈ నెల 10న ఆమె మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం జంతర్ మంతర్ వద్ద ధర్నాకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించేందుకు ఆమె రెండ్రోజుల ముందే ఢిల్లీకి చేరుకున్నారనే ప్రచారం జరుగుతోంది. కాగా.. ఈ నెల 10 కవిత దీక్షకు 18 పార్టీలకు చెందిన నేతలు హాజరుకానున్నారు. సిపిఎం జాతీయ నేత సీతారాం ఏచూరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని సమాచారం. అలాగే సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ . రాజా ముగింపు ఉపన్యాసం చేస్తారని తెలుస్తోంది. ఈ మేరకు భారత జాగృతి ఏర్పా ట్లు చేస్తోంది. మరోవైపు భారత జాగృతి కూడా ఢిల్లీ దీక్షపై స్పష్టమైన ప్రకటన చేసింది. మహిళా బిల్లు డిమాండ్‌తో తలపెట్టిన దీక్ష నిర్వహించి తీరుతామని, దానికి కవిత తప్పనిసరిగా హాజరవుతారని జాగృతి నాయకుడు రాజీవ్ సాగర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా నిరసన జరిగి తీరుతుందని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News