Thursday, April 25, 2024

జెండా పండుగ అదరాలి

- Advertisement -
- Advertisement -
సెప్టెంబర్ 2న జెండా పండుగను ఘనంగా నిర్వహించాలని
పార్టీ శ్రేణులకు టెలీకాన్ఫరెన్స్‌లో కెటిఆర్ ఆదేశం

TRS Party Formation Day Celebrations

ఆ రోజున ఢిల్లీలో పార్టీ కార్యాలయ భవనం శంకుస్థాపనకు సిఎంతో పాటు
శాసనసభ్యులు, ఇతర ముఖ్యనేతలు హాజరవుతున్నందున స్థానిక నాయకత్వం
జెండా ఉత్సవం విజయవంతానికి కృషి చేయాలని సూచన అదే సమయంలో
2నుంచి 12వ తేదీ వరకు జరిగే పార్టీ కమిటీల ఏర్పాటును కూడా విజయవంతం
చేయాలని నిర్దేశం 20వ తేదీ తర్వాత జిల్లా కార్యవర్గాల, జిల్లా అధ్యక్షుల ఎంపిక

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ జరపని విధంగా రెండవ తేదీన జెండా పండుగను ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు టిఆర్‌ఎస్ పార్టీవర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కె.తారక రామారావు పిలుపు నిచ్చారు. ఈ పండుగతో రాష్ట్ర మొత్తం గులాబీమయం కావాలన్నారు. ఎక్కడ చూసిన పార్టీ జెండాలు రెపరెపలాడాలాన్నారు. గ్రామలు, పట్టణాలలోని వార్డుల్లో పార్టీ జెండాలనును పెద్దసంఖ్యంలో ఎగురవేసే కార్యక్రమాలను అట్టహాసంగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమాలను చూసి విపక్షాలకు దడ పుట్టాలన్నారు.

ఈమేరకు మంగళవారం మంత్రులు, ఎంపిలు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, జెడ్‌పిటిసిలు, ఎంపిటిసిలు, మున్సిపల్ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ రాష్ట్ర కార్యవర్గం, పార్టీ సర్పంచులతో ఆయన టెలికాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ సంస్ధగత నిర్మాణంపైన నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు. సెప్టెంబర్ రెండో తేదిన జరిగే పార్టీ జెండా పండగ కార్యక్రమానికి గ్రామ, వార్డులో పరిధిలో పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరూ వచ్చేలా సమాచారం అందించి సమన్వయం చేసుకోవాలన్నారు. అదే రోజున ఢీల్లీలో పార్టీ కార్యాలయ భవనానికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు చేయనున్న శంఖుస్థాపనకు శాససనభ్యులతో పాటు పార్టీ ముఖ్యనేతలంతా హాజరవుతున్న నేపథ్యంలో స్థానిక నాయకత్వం ఈ జెండా పండగ విజయవంతానికి కృషి చేయాలన్నారు. ఈమేరకు శాసనసభ్యులు, పార్టీ నియోజకవర్గ ఇంచార్జీలు, సినియర్ నాయకులు ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేసుకోవాలని సూచించారు.

జెండా పండగ తరువాత వెంటనే పార్టీ సంస్ధాగత నిర్మాణంలో భాగంగా కమిటీల ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించాలన్నారు. ఇందులో భాగంగా 2వ తేదీ నుంచి 12వ తేదీ వరకు గ్రామపంచాయతీలు, వార్డు కమిటీల ఏర్పాటు చేయాలన్నారు. 12 నుంచి 20వ తేదీ వరకు మండల, పట్టణ కమిటీలను నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు. 20వ తేదీ తర్వాత జిల్లా కార్యవర్గాల ఎంపిక, జిల్లా అధ్యక్షుల ఎంపికను స్థానిక ప్రజా ప్రతినిధులు రాష్ట్ర నాయకత్వం సమన్వయం చేసుకొని ప్రకటిస్తుందని తెలిపారు. జిల్లా కార్యవర్గాల ఎంపిక తర్వాత రాష్ట్ర కార్యవర్గాన్ని సిఎం కెసిఆర్ ప్రకటిస్తారని ఆయన తెలిపారు. జిల్లా అధ్యక్షులు, నూతన జిల్లా కార్యవర్గాలను పార్టీ ఎంపిలు, శాసనసభ్యులతో సమన్వయం చేసుకుని ప్రకటిస్తారన్నారు.

అలాగే పార్టీ కమిటీల కూర్పు విషయంలో ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ పలు సూచనులు చేశారు. పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వారికే ఈ కమిటీలలో చోటు ఉంటుందన్నారు. పార్టీ కమిటీల్లో ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీలు ఖచ్చితంగా 51 శాతం ఉండాలన్నారు. లేకుంటే ఆయా కమిటీలు చెల్లవని స్పష్టం చేశారు. పార్టీ అనుబంధ కమిటీలతో పాటు గ్రామ, మండల స్థాయి పార్టీ సోషల్ మీడియా కమిటీ ఏర్పాటుకు కెటిఆర్ పలు సూచనలు చేశారు. ముందుగా మండల కమిటీలు పూర్తి చేసిన తరువాత గ్రామ స్ధాయి సోషలు మీడియా కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. అన్ని కమిటీల్లో మహిళా కార్యకర్తలకు తగిన చోటు కల్పించాలని సూచించారు.

హైదరాబాద్ నగర ప్రత్యేక సమావేశం

హైదరాబాద్ నగర విస్తృతి, జనాభా ,ఇక్కడి పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యేక నగర సమావేశం ఉంటుందన్నారు. నగరంలో బస్తి, డివిజన్ కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కమిటీల ఏర్పాటులో నగర శాసనసభ్యులు, పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జీలు, కార్పొరేటర్లు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, రాష్ట్రస్థాయి నాయకత్వం ఈ విషయంలో సమన్వయం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతారన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఈ నెల మొదటి వారంలోనే హైదరాబాద్ నగర ప్రత్యేక సమావేశం ఉంటుందని కెటిఆర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News