హైదరాబాద్ః తెలంగాణ రాష్ట్ర సమితి(టిఆర్ఎస్) పారీ రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ శ్రేణులకు, రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఏప్రిల్ 27, టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం తెలంగాణ భవన్లో ఉ.9.30గంటలకు పార్టీ జెండాను సిఎం కెసిఆర్ ఆవిష్కరించనున్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించడంతోపాటూ అన్ని రంగాల్లో టిఆర్ఎస్ గొప్ప విజయాలను సాధించిందని సిఎం అన్నారు. టిఆర్ఎస్ సారథ్యంలోని టిఆర్ఎస్ ప్రభుత్వం గడిచిన ఆరేళ్లలో అనేక అద్భుతాలు సాధించిందన్నారు. సంక్షేమం, విద్యుత్, మంచినీరు, సాగునీరు, వ్యవసాయం, పరిశ్రమలు తదితర రంగాల్లో ప్రభుత్వం గొప్ప విజయాలు సాధించిందని, ప్రజలు దశాబ్దాల తరబడి ఎదుర్కొంటున్న అనేక సమస్యలను టిఆర్ఎస్ ప్రభుత్వం పరిష్కరించిందని తెలిపారు. యావత్ దేశానికే ఆదర్శంగా నిలచేలా టిఆర్ఎస్ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తోందని కెసిఆర్ పేర్కొన్నారు.
TRS Party to Complete 20 Decades on April 27