Saturday, April 20, 2024

జడ్చర్ల పీఠం టిఆర్ఎస్ దే….

- Advertisement -
- Advertisement -

TRS Party won Jedcherla municipal elections

మహబూబ్ నగర్: జడ్చర్ల మున్సిపల్ ఎన్నికలలో టిఆర్‌ఎస్ పార్టీ విజయదుందుభి మోగిస్తోంది. 16 స్థానాలలో టిఆర్‌ఎస్ విజయకేతనం ఎగరేసింది. జడ్చర్లలో 27 వార్డులు ఉండగా 19 స్థానాలలో ఫలితాలు వెలువడ్డాయి. 16 స్థానాలు టిఆర్ఎస్, రెండు స్థానాలలో బిజెపి, ఒక స్థానంలో కాంగ్రెస్ గెలుపొందింది. ఎవరు 14 స్థానాలు గెలిస్తే ఆ పార్టీ వారే మున్సిపల్ చైర్మన్ పదవి దక్కించుకుంటారు. టిఆర్ఎస్ 16 స్థానాలు గెలుపొందడంతో వారికే మున్సిపల్ చైర్మన్ పదవి దక్కనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News