హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి(టిఆర్ఎస్) పార్టీ ద్వి దశాబ్ది వేడుకల్లో భాగంగా ఈ నెల 25న పార్టీ అధినేత ఎన్నిక కోసం మాదాపూర్ హై టెక్స్ లో నిర్వహించే ప్లీనరీ సమావేశం ఏర్పాట్లపై ప్లీనరీ ఆహ్వాన కమిటీ సభ్యులు, మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అరికేపూడి గాంధీ మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఆయా ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించడంతోపాటు, ఆయా పనులలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా వివరించారు. ప్లీనరీకి వచ్చే ప్రజా ప్రతినిధులు, నాయకులకు ఎటువంటి ఇబ్బందీ కలగకుండా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. నిర్ణీత కాలానికి ముందే ఏర్పాట్లన్నీ పూర్తి కావాలని సంబంధిత ఇంచార్జీలకు సూచించారు. అలాగే అధికారులు, పోలీస్ ల పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద వారికి పలు సూచనలు చేశారు. ఈ సమావేశానికి సిఎం కెసిఆర్, మంత్రులు, పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు హాజరుకానున్నారు.
TRS Plenary Meeting at Madhapur on Oct 25th