Friday, March 29, 2024

వరిపై కేంద్రం తీరుకు నిరసగా నిర్మల్ లో టిఆర్ఎస్ ర్యాలీ..

- Advertisement -
- Advertisement -

నిర్మల్: ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. టీఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం నిర్మల్ పట్టణంలో నిరసన కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ర్యాలీలో టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులతో కలిసి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. మున్సిపల్ కార్యాలయం నుంచి మంచిర్యాల చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం, బిజెపి పార్టీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మను దగ్దం చేశారు.

TRS Protest against Centre over Paddy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News