Wednesday, April 24, 2024

హుజూరాబాద్ లో టిఆర్ఎస్ ఎన్నారై శాఖ ప్రచారం! : గుర్రాల నాగరాజు

- Advertisement -
- Advertisement -

హుజూరాబాద్ లో టిఆర్ఎస్ ఎన్నారై శాఖ ప్రచారం! : గుర్రాల నాగరాజు (సౌత్ ఆఫ్రికా శాఖ అధ్యక్షులు)

 హైదరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల్లో టిఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆద‌రిస్తార‌నే విశ్వాసం ఉంద‌ని టిఆర్‌ఎస్‌ సౌత్ ఆఫ్రికా ఎన్నారై శాఖ అధ్యక్షులు గుర్రాల నాగరాజు తెలిపారు. ఉప ఎన్నికలలో టిఆర్‌ఎస్‌ ఎన్నారై సౌత్ ఆఫ్రికా శాఖ తరఫున ప్రచారం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు టిఆర్ఎస్ ఎన్నారై సౌత్ ఆఫ్రికా శాఖ అధ్యక్షుడు గుర్రాల నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ ప్రచారంలో టిఆర్‌ఎస్‌ సౌత్ ఆఫ్రికా ఎన్నారై శాఖ అధ్యక్షులు గుర్రాల నాగరాజు ప్రచారములో పాల్గొననున్నారు. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో టిఆర్‌ఎస్‌ దూసుకవెళ్తుంది. ప్రభుత్వం చేసిన పనులు.. ఇకముందు చేయబోయే కార్యక్రమాలను వివరిస్తూ, గడపగడపకూ విస్తృతంగా ప్రచారం చేయనున్నట్టు నాగరాజు తెలిపారు. ప్రజలంతా టిఆర్ఎస్ వైపే వున్నారని త్వరలో తమ ప్రచార షెడ్యూల్ ని ప్రకటిస్తారని పేర్కొన్నారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికకు అక్టోబర్‌ 30న పోలింగ్‌ నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News