Wednesday, April 24, 2024

సంక్షేమ పథకాలే టిఆర్‌ఎస్‌ను గెలిపిస్తాయి: భూపాల్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

TRS won with welfare schemes in Nagarjuna Sagar by Elections

నల్లగొండ: సిఎం కెసిఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలే టిఆర్‌ఎస్‌ను గెలిపిస్తాయని ఎంఎల్‌ఎ కంచర్ల భూపాల్ రెడ్డి తెలిపారు. గుర్రంపోడులో ఎంఎల్‌ఎ కంచర్ల భూపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేపట్టిన సందర్భంగా భూపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రజలు స్వచ్ఛందంగా టిఆర్‌ఎస్‌కు మద్దతు తెలుపుతున్నాయన్నారు. నాగార్జుల సాగర్ ఉప ఎన్నికల్లో టిఆర్‌ఎస్ నోముల భగత్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఆడ బిడ్డలకు కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ ద్వారా లక్ష రూపాయలు ఇస్తున్నామని పేర్కొన్నారు. ప్రసవ సమయంలో అమ్మాయి జన్మిస్తే 13 వేల రూపాయలు, అబ్బాయి జన్మిస్తే 12 వేల రూపాయలు కెసిఆర్ కిట్ అందిస్తున్నామని తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News