Saturday, April 20, 2024

7వరకు ఎడ్‌సెట్ దరఖాస్తు గడువు పొడిగింపు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో బి.ఇడి కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎడ్‌సెట్ ఆన్‌లైన్ దరఖాస్తు గడవును మరోసారి పొడిగించారు. బుధవారంతో(జూన్ 30) దరఖాస్తు గడువు ముగియడంతో ఆ గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. జులై 7వ తేదీ వరకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని ఎడ్‌సెట్ కన్వీనర్ ఎ.రామకృష్ణ తెలిపారు. ఎడ్‌సెట్ పరీక్షలను ఆగస్టు 24, 25 తేదీల్లో నిర్వహించనున్నారు. అలాగే బిపిఇడి, డిపిఇడి కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పిఇసెట్ దరఖాస్తు గడువును ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించారు.

TS EDCET application date Extends till July 7

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News