Friday, April 19, 2024

సింగూరు ప్రాజెక్టు రిపేర్లకు రూ.16కోట్లు

- Advertisement -
- Advertisement -

TS Govt releases Rs 16 crore for Singur project repairs

హైదరాబాద్: మంజీరానదిపై ఆందోల్ నియోజకవర్గం పరిధిలో ఉన్న సింగూరు ప్రాజెక్టు రిపేర్లకు ప్రభుత్వం రూ.16.85కోట్లు మంజూరు చేసింది. స్థానిక ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ఇటీవల ఈ ప్రాజెక్టుకు సంబంధించిన రిపేర్ల ప్రతిపాదనను ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టికి తీసుకుపోయారు. ముఖ్యమంత్రి ఆదేశాలమేరకు నీటిపారుదల శాఖ అధికారులు సింగూరు ప్రాజెక్టు వద్ద సర్వేనిర్వహించి చేపట్టాల్సిన పనులను ప్రభుత్వానికి నివేదించారు. ఈ నేపధ్యంలో సిఎం ప్రాజెక్టు రిపేర్లకు అవసరమైన నిధులు మంజూరు. నిధుల మంజూరు పట్ల సిఎం కెసిఆర్‌కు, ఆర్ధికశాఖ మంత్రి హరీష్ రావుకు ఎమ్మెల్యే క్రాంతికిరణ్ కృతజ్ణతలు తెలిపారు.

TS Govt releases Rs 16 crore for Singur project repairs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News