Saturday, April 20, 2024

ప్రశాంతంగా గురుకులాల ఉమ్మడి ప్రవేశ పరీక్ష

- Advertisement -
- Advertisement -

TS Gurukul 5th class entrance exam

90.91% విద్యార్థుల హాజరు, ప్రతి సీటుకు ముగ్గురు విద్యార్థులు పోటీ
సకాలంలో ప్రవేశాల కల్పించాలని అధికారులకు మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశం

హైదరాబాద్ : గురుకులాల ఉమ్మడి ప్రవేశ పరీక్ష (విటిజి సెట్ -2022 ) ప్రశాంతంగా ముగిసింది. గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతిలో 2022 విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్షకు లక్షా 34వేల 478 మంది బాలబాలికలు హాజరయ్యారు. గత విద్యా సంవత్సరంలో 74వేల 52మంది మంది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు. గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో 48 వేల120 మంది విద్యార్థినీ విద్యార్థులకు ప్రవేశాలు లభిస్తాయి. ఒక్క సీటు కోసం సగటున ముగ్గురు విద్యార్థులు పోటీ పడ్డారు. ప్రభుత్వం పెద్ద సంఖ్యలో గురుకులాలను ప్రారంభించడం, వీటిలో ఉచితంగా ఇంగ్లీష్ మీడియంలో ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యతో పాటు పోషకాహారాన్ని అందిస్తుండడంతో ప్రవేశాల కోసం పోటీ బాగా పెరిగింది. గురుకులాలకు సంబంధిత ఈ ప్రవేశ పరీక్షను విజయవంతంగా, ప్రశాంతంగా నిర్వహించినందుకు గాను మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎస్‌సి,ఎస్‌టి గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శి రోనాల్డ్ రాస్, అన్ని సొసైటీలకు చెందిన అధికారులు, సిబ్బందిని అభినందించారు. ఇదే ఉత్సాహంతో ఫలితాలు త్వరితగతిన ప్రకటించి, సకాలంలో ప్రవేశాలను పూర్తి చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. అత్యుత్తమ ఫలితాలు సాధించే విధంగా విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాల్సిందిగా మంత్రి కొప్పుల అధికారులకు సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News