Thursday, April 25, 2024

12 నుంచి ఇంటర్ స్పాట్ వ్యాల్యుయేషన్

- Advertisement -
- Advertisement -

TS Inter spot evaluation from 12

జూన్ రెండో వారంలో ఫలితాలు..?

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంటర్మీడియట్ జవాబు పత్రాల మూల్యాకంనం(స్పాట్ వ్యాల్యుయేషన్) ప్రక్రియ ఈ నెల 12 నుంచి ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 14 కేంద్రాలలో జవాబుపత్రాల మూల్యాంకనం నిర్వహించనున్నారు. ఇప్పటివరకు బోర్డు పరిధిలో 12 స్పాట్ వ్యాల్యుయేషన్ కేంద్రాలు ఉండగా, ఈ సారి కొత్తగా మంచిర్యాల, సిద్ధిపేట జిల్లా కేంద్రాలలో జవాబుపత్రాల మూల్యాంకనం కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ నెల 12న ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం సంస్కృతం జవాబుపత్రాల మూల్యాంకనం చేపట్టనుండగా, ఈనెల 22న ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఇంగ్లీష్, తెలుగు, హిందీ, మ్యాథ్స్, పొలిటికల్ సైన్స్ పేపర్లు దిద్దనున్నారు. 26న ఫిజిక్స్, ఎకనామిక్స్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పేపర్లు, 28న కెమిస్ట్రీ, కామర్స్, 31న హిస్టరీ, బాటనీ, జూవాలజీ జవాబుపత్రాలను మూల్యాంకనం చేపట్టనున్నారు. .జూన్ రెండో వారంలో ఇంటర్ ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇంటర్ పరీక్షలు జరుగుతుండగా, ఈనెల 24న ఇంటర్ పరీక్షలు ముగియనున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News