Thursday, April 25, 2024

గ్రూప్ 4కు ముగిసిన దరఖాస్తు గడువు.. రికార్డు స్థాయిలో దరఖాస్తులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టిఎస్‌సిఎస్‌సి ద్వారా భర్తీ చేయనున్న గ్రూప్ 4 పోస్టులకు దరఖాస్తు గడువు ముగిసింది. రికార్డు స్థాయిలో 9,51,321 దరఖాస్తులు వచ్చాయి. గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీ కింద 8,180 పోస్టుల భర్తీకి టిఎస్‌పిఎస్‌సి దరఖాస్తులను ఆహ్వానించింది. వాస్తవానికి జనవరి 30తో గ్రూప్4 దరఖాస్తులకు గడువు ముగిసింది. ఆ రోజు వరకు 8,47,277 దరఖాస్తులు వచ్చాయి.

జనవరి 29న 49 వేలు, 30వ తేదీన 34,247 దరఖాస్తులు వచ్చినట్లు టిఎస్‌పిఎస్‌సి అధికారులు వెల్లడించారు. ఈ మూడు రోజుల వ్యవధిలో 1,04,044 దరఖాస్తులు కొత్తగా వచ్చాయి. గ్రూప్ 4 రాత పరీక్ష జులై 1న నిర్వహించనున్నట్లు టిఎస్‌పిఎస్‌సి ప్రకటించిన విషయం తెలిసిందే.

హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్1, గ్రేడ్ 2, మ్యాట్రన్ గ్రేడ్1, గ్రేడ్2 వార్డెన్ గ్రేడ్1, గ్రేడ్2 , లేడీ సూపరింటెండెంట్ పోస్టులకు దరఖాస్తు గడువు ముగిసంది. 581 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించగా 1, 45,358 దరఖాస్తులు వచ్చాయి. పరీక్ష ఆగస్టులో నిర్వహించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News