Thursday, April 25, 2024

Yadadri: తుర్కపల్లిలో బైక్ ను ఢీకొట్టిన ఆర్ టిసి బస్సు: ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

 

మన తెలంగాణ/భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మాదాపూర్ గ్రామ శివారు పెట్రోల్ బంక్ వద్ద ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గ్రామస్తులు,పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం ….. ఆర్టిసి బస్సు ను ఎదురుగా వస్తున్న బైక్ ఢీ కొనడంతో ప్రమాద స్థలంలో ఒక వ్యక్తి అక్కడకిఅక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయ పడడంతో 108 అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులు మాదాపూర్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News